bathukamma: ఎల్బీ స్టేడియంలో 35 వేల మంది మ‌హిళ‌లతో 'మహా బతుకమ్మ' సంబురాలు!

  • తెలంగాణ వ్యాప్తంగా ఘ‌నంగా బ‌తుక‌మ్మ సంబురాలు 
  • గిన్నీస్‌లో చోటే ల‌క్ష్యంగా ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ
  • హాజరైన ఎంపీ కవిత

తెలంగాణ వ్యాప్తంగా బ‌తుక‌మ్మ సంబురాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హిస్తోన్న‌ మహా బతుకమ్మ సంబురాలకు టీఆర్ఎస్ ఎంపీ క‌విత హాజ‌ర‌య్యారు. గిన్నీస్‌లో చోటే ల‌క్ష్యంగా 35 వేల మంది మ‌హిళ‌లు ఈ మ‌హాబ‌తుక‌మ్మ వేడుక‌లో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున పేర్చిన బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ లయబద్ధంగా మ‌హిళ‌లు బ‌తుక‌మ్మ‌ ఆడుతున్నారు.

ఈ సంబు‌రానికి తెలంగాణ‌లోని అన్ని జిల్లాల నుంచి మ‌హిళ‌లు త‌ర‌లివ‌చ్చారు. బతుక‌మ్మ మ‌హా సంబురాల్లో పాల్గొనేందుకు ప‌లు రాష్ట్రాల నుంచి బ్ర‌హ్మ‌కుమారీలు కూడా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ క‌విత మాట్లాడుతూ... ఎల్బీ స్టేడియంలో బ‌తుక‌మ్మ సంబురాల‌కు ఏర్పాట్లు చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.

 


More Telugu News