గిరిజన సలహా మండలి: గిరిజన సలహా మండలి జన్మభూమి కమిటీలా ఉంది: వైసీపీ నాయకుడు బాలరాజు

ఏపీ గిరిజన సలహా మండలి జన్మభూమి కమిటీలా ఉందంటూ వైసీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఆరోపించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గిరిజనులను ఏపీ సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని, ఒక్క ఎస్టీ ఎమ్మెల్యేకు కూడా ఈ కమిటీలో స్థానం కల్పించలేదని ఆయన విమర్శించారు.

నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాలరాజు ప్రస్తావించారు. నాటి గిరిజన సలహా మండలిలో అన్ని పార్టీల నేతలకు స్థానం కల్పించారని అన్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ఏకపక్షంగా గిరిజన సలహా మండలిని నియమించారని, గిరిజనులకు ఇచ్చేందుకు చంద్రబాబు వద్ద నిధులు మాత్రం ఉండవని ఆయన మండిపడ్డారు.

More Telugu News