chiranjeevi: మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న చిరంజీవి సతీమణి

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. కృష్ణా జిల్లాలోని మోపిదేవికి వెళ్లిన ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలను అందించి, ఆశీర్వచనం పలికారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి చిత్రపటాన్ని అందించారు. సురేఖతో పాటు వారి బంధువులు కూడా ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేశారు.  

More Telugu News