ram: 'ఉన్నది ఒకటే జిందగీ' రిలీజ్ డేట్!

  •  రామ్ హీరోగా 'ఉన్నది ఒకటే జిందగీ'
  •  స్నేహం .. ప్రేమ .. త్యాగమే నేపథ్యం
  •  కథానాయికలుగా అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి
  •  దీపావళి కానుకగా అక్టోబర్ 27న రిలీజ్

ఎలాంటి కథను ఎంచుకోవాలనే ఆలోచనలో పడిన రామ్, ఈ సారి కాస్త ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తన తాజా సినిమాను ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేశాడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'నేను శైలజ' ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ హిట్ కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ ఇద్దరూ కలిసి 'ఉన్నది ఒకటే జిందగీ' చేశారు.

దీపావళి పండుగ కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు. రామ్ సరసన లావణ్య త్రిపాఠి .. అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటించారు. స్నేహం .. ప్రేమ .. త్యాగం అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. వైవిధ్యభరితమైన కథా కథనాలతో కూడిన ఈ సినిమా, తనకి తప్పకుండా మంచి హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రామ్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.    

More Telugu News