lakshmi's ntr: ఆ వార్తలో వాస్తవం లేదు: రాంగోపాల్ వర్మ

  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు జేడీ చక్రవర్తి నిర్మాత కాదు
  • ఫేస్ బుక్ లో వెల్లడించిన రాంగోపాల్ వర్మ

దివంగత నేత ఎన్టీ రామారావు బయోపిక్ ను ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి దృష్టి కోణం నుంచి తెరకెక్కించనున్నానని చెప్పిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, దానికి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అన్న టైటిల్ ను కూడా పెట్టేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి నటుడు జేడీ చక్రవర్తి నిర్మాతని వస్తున్న వార్తలపై వర్మ స్పందించారు.

తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వివరణ ఇస్తూ, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి జేడీ నిర్మాత కాదని తేల్చేశారు. మీడియాలో ప్రసారమైన వార్తల్లో నిజం లేదని చెప్పారు. కాగా, వర్మ ప్రకటించిన చిత్రంపై ఇప్పటికే దుమారం చెలరేగుతోంది. చిత్రంలో వాస్తవాలు చెబితేనే మద్దతిస్తానని, లేకుంటే వ్యతిరేకిస్తానని లక్ష్మీ పార్వతి స్పష్టం చేయగా, స్క్రిప్టు మొత్తాన్ని ముందే ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి చూపించి అనుమతి తీసుకున్న తరువాతే నిర్మించాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు.

More Telugu News