ntr: తొలి వారాంతంలో షాకిస్తోన్న 'జై లవ కుశ' వసూళ్లు!

  • కొనసాగుతోన్న 'జై లవ కుశ' జోరు
  •  తెలుగు రాష్ట్రాల్లో 62 కోట్లు
  •  అమెరికాలో 9.08 కోట్లు
  •  తదుపరి వసూళ్లపై 'స్పైడర్' ప్రభావం చూపేనా?      

'జై లవ కుశ' ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 2400 థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి అయిదు రోజుల్లో ఈ సినిమా 62 కోట్లను వసూలు చేసింది. కర్ణాటకలో 11 కోట్లు .. తమిళనాడులో 2.25 కోట్లు .. మిగతా ప్రాంతాల్లో 7.5 కోట్లను ఈ సినిమా రాబట్టింది.

 ఇక ఈ అయిదు రోజుల్లో అమెరికాలో ఈ సినిమా 9.08 కోట్లను వసూలు చేసింది. తొలి వారంలో ఈ సినిమాకి పోటీగా మరే సినిమా లేకపోవడం వసూళ్ల పరంగా బాగా కలిసొచ్చిందని అంటున్నారు. ప్రస్తుతానికైతే 'జై లవ కుశ' జోరు కొనసాగుతూనే వుంది. ఎన్టీఆర్ కెరియర్లో అత్యధిక వసూళ్లు ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలో రేపు 'స్పైడర్' .. ఎల్లుండి 'మహానుభావుడు' సినిమాలు థియేటర్స్ కి రానున్నాయి. మరి వాటి ప్రభావం 'జై లవ కుశ' పై ఎలా వుంటుందో చూడాలి.        

More Telugu News