బంగారు నగల్లో 'వేస్టేజ్' ఎక్కడో చెప్పండి: జ్యూయెలర్స్ కంపెనీలకు 'లలితా' ఎండీ కిరణ్ కుమార్ సవాల్

- వృథా ఎక్కడో చెబితే నేను వెళ్లి బంగారాన్ని వెతుక్కుంటా
- నాలాగే 3 శాతం తరుగుతో విక్రయించండి
- ప్రచారకర్తను పెట్టుకోలేక కాదు
- నేను చెప్పాలనుకున్నది చెప్పాలి కాబట్టే నా యాడ్ లు
- లలితా జ్యూయెలర్స్ ఎండీ కిరణ్ కుమార్
కొన్ని నగలకు 22 శాతం వరకూ వేస్టేజ్ వేయడాన్ని తప్పుబట్టిన ఆయన, అంత వృథా ఎక్కడ పోతున్నదో చెప్పాలని సవాల్ విసిరారు. ఇక తన సంస్థకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంపై స్పందిస్తూ, తానెవరినైనా ప్రచారకర్తను పెట్టుకుంటే, ఆయనేం చెప్పాలన్నది కూడా తానే రాసివ్వాల్సి వుంటుందని, సొంతంగా మాట్లాడే శక్తి అతనికి ఉండదని చెప్పారు. సోషల్ మీడియాలో 'గుండు బాస్' అని తనను పిలుస్తున్నారని, 'గుండు' అంటే చాలునని, 'బాస్' అనక్కర్లేదని కిరణ్ కుమార్ జోకేశారు.