chandra: ఆ రాత‌లు ఎంతో బాధ క‌లిగిస్తున్నాయి!: ఏపీ సీఎం చంద్ర‌బాబు

  • తెలంగాణ నీటిని దొంగిలిస్తున్నామ‌ని కొన్ని ప‌త్రిక‌లు రాస్తున్నాయి
  • పెద్ద ఎత్తున అభివృద్ధి జ‌రుగుతోంటే జ‌గ‌న్ ఓర్వ‌లేక‌పోతున్నా‌రు 
  • ప్ర‌తిప‌క్ష నేత‌లు రాక్ష‌స‌త్వంతో ప్ర‌వ‌ర్తిస్తున్నారు
  • తప్పుడు ప్ర‌చారాలు చేయొద్దు

తెలంగాణ నీటిని దొంగలిస్తున్నామ‌ని కొన్ని ప‌త్రిక‌లు రాస్తున్నాయని, ఆ రాత‌లు త‌న‌ను ఎంతో బాధ క‌లిగిస్తున్నాయని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ..  పెద్ద ఎత్తున అభివృద్ధి జ‌రుగుతోంటే జ‌గ‌న్ ఓర్వ‌లేక‌పోతున్నార‌ని అన్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆయ‌న ప‌త్రిక రాత‌లు రాస్తోంద‌ని మండిప‌డ్డారు.

నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏ రాష్ట్రానికి వ‌చ్చే నీళ్ల‌ను ఆ రాష్ట్రం వాడుకుంటుంద‌ని చంద్రబాబు చెప్పారు. ప్ర‌తిప‌క్ష నేత‌లు రాక్ష‌స‌త్వంతో ప్ర‌వ‌ర్తిస్తున్నారని, వారు మ‌నుషులేనా అనిపిస్తోందని అన్నారు. వారు అన్ని ప్రాజెక్టుల‌కు అడ్డుత‌గిలారని, ఇలా తప్పుడు ప్ర‌చారాలు చేయ‌కూడ‌దని వ్యాఖ్యానించారు. క‌ఠిన నిర్ణ‌యాల‌తో తాము అవినీతిని కూడా అరిక‌డుతున్నామ‌ని చెప్పారు.

More Telugu News