sai dharam tej: వినాయక్ తో మెగా హీరో మూవీ మొదలైపోయింది!

  •  వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్
  •  రెగ్యులర్ షూటింగ్ ఈ రోజే మొదలు
  •  తన కల నిజమైందంటోన్న తేజు
  •  కథానాయికగా లావణ్య త్రిపాఠి

చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో హిట్ కొట్టిన వినాయక్, ఆ తరువాత సినిమాను ఎన్టీఆర్ తో చేయాలనుకున్నారు. కానీ అప్పటికే ఎన్టీఆర్ కి వున్న కమిట్ మెంట్స్ వలన, ఈ కాంబినేషన్ కుదరలేదు. దాంతో ఆయన సాయిధరమ్ తేజ్ తో చేయడానికి రెడీ అయ్యాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి.

 ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజునే మొదలైంది. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీ ని సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయాలనేది తన కల అనీ .. ఆ కల నిజమైనందుకు తనకి చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి ఆకుల శివ కథను అందించగా, పరుచూరి బ్రదర్స్ - సత్యానంద్ స్క్రీన్ ప్లే ను సమకూర్చారు. మెగా స్టార్ కి హిట్ ఇచ్చిన వినాయక్ .. ఈ మెగా హీరోకి కూడా సక్సెస్ ను తెచ్చిపెడతాడేమో చూడాలి.           

More Telugu News