banglore: నాన్నా... వాళ్లు అక్క వెనకాల కూడా పడుతున్నారు...: హత్యకు గురవడానికి ముందు విద్యార్థి వాట్స్ యాప్ వీడియో

  • బెంగళూరు అధికారి కుమారుడిని కిడ్నాప్ చేసిన దుండగులు
  • రూ. 50 లక్షలు డిమాండ్
  • ఆపై హత్య చేసి సరస్సులో పారేసిన కిడ్నాపర్లు

బెంగళూరులో కిడ్నాప్ నకు గురై, హత్యకు గురైన 19 ఏళ్ల విద్యార్థి నుంచి అతని తల్లిదండ్రులకు వచ్చిన వాట్స్ యాప్ వీడియో కలకలం రేపుతోంది. సెప్టెంబర్ 12న విద్యార్థి శరత్ ను ఎత్తుకెళ్లిన దుండగులు అతని సెల్ ఫోన్ లోనే వీడియో తీయించి పంపారు.

"హలో నాన్నా నన్ను కిడ్నాప్ చేశారు. వారికి 50 లక్షలు కావాలట. దయచేసి ఇచ్చేయ్" అని చెప్పాడు. ఆపై మరో వీడియోను పంపుతూ, "వాళ్లు నా అక్క వెంట కూడా పడుతున్నారు. రోజూ అక్క ఏం చేస్తుందో, ఎక్కడికి వెళుతుందో వారికి అన్నీ తెలుసు" అని చెప్పాడు. ఈ వీడియోను దుండగులు రికార్డు చేస్తున్న సమయంలో పక్కకు తిరిగిన శరత్, తాను సరిగ్గా చెప్పానా? అని అడిగాడు.

బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పనిచేస్తున్న నిరంజన్ కుమారుడైన శరత్, తన కొత్త బైకును స్నేహితులకు చూపించేందుకు వెళ్లి తిరిగి రాలేదు. జరిగిన ఘటనపై నిరంజన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలోనే కిడ్నాపర్ల నుంచి ఈ వీడియోలు వచ్చాయి. కాగా, శరత్ మృతదేహాన్ని ఈ ఉదయం ఓ సరస్సులో పోలీసులు కనుగొన్నారు. అతన్ని కిడ్నాప్ చేసిన రోజే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు, ఆరుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన వెనుక నిరంజన్ స్నేహితుడు ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News