gopichand: 'ఆక్సిజన్' రిలీజ్ మరింత ఆలస్యం .. మళ్లీ వాయిదా!

  •  గోపీచంద్ తదుపరి చిత్రంగా 'ఆక్సిజన్'
  •  ఇప్పటికే పలుమార్లు వాయిదా
  •  అక్టోబర్ 27న అంటూ తాజా ప్రకటన
  •  కథానాయికలుగా రాశి ఖన్నా .. అనూ ఇమ్మాన్యుయేల్       

గోపీచంద్ కథానాయకుడిగా జ్యోతికృష్ణ  దర్శకత్వంలో 'ఆక్సిజన్' చిత్రం తెరకెక్కింది. ఐశ్వర్య నిర్మించిన ఈ సినిమాలో రాశిఖన్నా .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా 'గౌతమ్ నందా' కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రావలసి వుంది. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది.

 అక్టోబర్ 12 న విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా చెప్పారు .. ఆ తరువాత అక్టోబర్ 17కి వెళ్లారు. ఇక ఇప్పుడు అక్టోబర్ 27ను విడుదల తేదీగా ఫిక్స్ చేశారనేది తాజా సమాచారం. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం గోపీచంద్ అభిమానులంతా కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే విడుదల తేదీలను పదే పదే మారుస్తూ ఉండటమే వాళ్లకి అసహనాన్ని కలిగిస్తోంది. ఇలా విడుదల తేదీలను మాటిమాటికి మార్చడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    

More Telugu News