Aishwarya Rai: రాజ్‌కుమార్ రావుతో సన్నిహిత సీన్ల షూటింగ్‌కు నో చెప్పిన ఐశ్వర్య

  • అత్తమామల ఆగ్రహమే కారణం!
  • గత సినిమాలో రణబీర్‌తో హాట్‌ సీన్లలో నటించిన ఐష్
  • ఐశ్వర్య నిర్ణయంతో బాలీవుడ్ విస్మయం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె ‘ఫన్నీ ఖాన్’ సినిమాలో నటిస్తోంది. ఇందులో రాజ్‌కుమార్ రావుతో సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణకు ఐశ్వర్య నో చెప్పినట్టు బాలీవుడ్ వర్గాల భోగట్టా. ఈ సీన్లను తీవ్రంగా వ్యతిరేకించిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణ వద్దని కరాఖండీగా చెప్పినట్టు తెలుస్తోంది. మ్యూజికల్ కామెడీ అయిన ఈ సినిమాలో అనిల్ కపూర్ కూడా నటిస్తున్నాడు.

2000లో వచ్చిన డొమినిక్ డ్యూరుడెరే ఆస్కార్ చిత్రం ‘ఎవిరీబడీ ఫేమస్’ చిత్రం స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా, ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి రెచ్చిపోయి నటించిన ఐశ్వర్య తాజా నిర్ణయం విని బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఆ సినిమాలో సీన్లు చూసిన అత్తమామలు జయాబచ్చన్, అమితాబ్ బచ్చన్‌లు కొంత అసహనానికి గురి కావడమే ఐశ్వర్య తాజా నిర్ణయానికి కారణమని చెబుతున్నారు.

More Telugu News