ntr: ఎన్టీఆర్ నో అంటే 'జై లవ కుశ'ను పక్కన పెట్టేసేవాడిని : బాబీ

  • 'జై లవ కుశ' రెస్పాన్స్ పట్ల బాబీ ఆనందం
  •  ఎన్టీఆర్ నటన అద్భుతం
  •  ఆయనని దృష్టిలో పెట్టుకునే కథ రాశాను
  •  ఆయన కుదరదంటే ఈ కథను పక్కన పెట్టేసేవాడిని      

ఎన్టీఆర్ కథానాయకుడిగా చేసిన 'జై లవ కుశ' ఈ రోజున భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మూడు విభిన్నమైన పాత్రలను ఒకేసారి పోషించడం అంత తేలికైన విషయం కాదని అన్నారు. అలాంటిది ఎన్టీఆర్ ఈ మూడు పాత్రలను అద్భుతంగా పండించారని చెప్పారు. ఎన్టీఆర్ సహకారం వలన ఈ సినిమాను 6 నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగామనీ, వేరే హీరోతో చేస్తే ఏడాదిన్నర పట్టేదని అన్నారు. అయినా తాను ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకునే ఈ కథను సిద్ధం చేసుకున్నాననీ, ఆయన గనుక నో చెప్పేసి వుంటే, తాను ఈ కథను పక్కన పెట్టేసేవాడినని చెప్పారు. ఎన్టీఆర్ అంకితభావానికి .. ఆయన  నటనా పటిమకు ఈ సినిమా ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.    

More Telugu News