vijayendra prasad: 'శ్రీవల్లీ' ఫ్లాప్ కావడానికి కారణం నేనే!: విజయేంద్ర ప్రసాద్


  • 'శ్రీవల్లీ' కథ ఆసక్తికరమైనదే
  •  నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు
  •  ఇంకా బాగా తెరకెక్కించవలసింది
  •  పరాజయానికి కారణం నేనే  

విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన 'శ్రీ వల్లీ' సినిమా, ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా జోనర్ సాధారణమైన ప్రేక్షకులకు అర్థం కాలేదు .. కాన్సెప్ట్ వారిని ఆకట్టుకోలేదు. దాంతో థియేటర్స్ లో ఈ సినిమా సందడి చేయలేకపోయింది.

తాజాగా ఈ సినిమా గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఈ సినిమా కథ ఆసక్తికరమైనదేననీ .. ఆకట్టుకునేదేనని ఆయన అన్నారు. తనని నమ్మి నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడలేదని చెప్పారు. అయితే తాను సరిగ్గా తెరకెక్కించలేకపోవడం వల్లనే ఈ సినిమా పరాజయాన్ని చవి చూసిందని అన్నారు. మరింత బాగా తాను చిత్రీకరించవలసి ఉండవలసిందని చెప్పారు. ఈ సినిమా ఆదరణ పొందకపోవడానికి తానే కారణమని అంగీకరించారు.  

More Telugu News