chandrababu: 25న ముస్సోరికి వెళ్లనున్న చంద్రబాబు నాయుడు

అఖిల భారత సర్వీసుల శిక్షణా సంస్థ నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించాలని, వారికి మార్గనిర్దేశం చేయాలని బాబును ఆహ్వానించారు. ఈ వివరాలను ఏపీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఈనెల 25న ముస్సోరికి వెళుతున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీలోని పాలనా సంస్కరణలపై ఐఏఎస్ లతో చంద్రబాబు మాట్లాడనున్నారు. ఇన్-సర్వీస్ ఐఏఎస్ లు, శిక్షణలో ఉన్న ఐఏఎస్ లతో జాయింట్ సెషన్లో చంద్రబాబు పాల్గొంటారని అధికారులు తెలిపారు.

More Telugu News