karnool: కర్నూలు జిల్లాలో ఏటీఎం చోరీ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏటీఎం చోరీ జరిగింది. ఎమ్మిగనూరు శివార్లలోని సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో ఈ చోరీ చోటుచేసుకుంది. ఇందులోని సీసీ కెమెరా పని చేయకపోవడంతో దుండగులు ఎవరు? అన్న విషయం తేలలేదు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కత్తిరించి, అందులోని 20,00,000 రూపాయలు దొంగిలించినట్టు తెలుస్తోంది. ముసుగులు ధరించిన దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News