laxmi rai: నలుగురైదుగురితో ఎఫైర్ నడిపాను... వారి గురించి అడగరేం?: రాయ్ లక్ష్మి

  • ధోనీ గురించే ఎందుకు...మిగిలినవారి గురించి కూడా అడగండి
  • రిలేషన్ నడిపిన వారంతా ప్రముఖులే 
  • లక్ష్మీ రాయ్ వ్యాఖ్యలతో షాకైన టాలీవుడ్, కోలీవుడ్ 
  • బాలీవుడ్ కల్చర్ ను బాగానే ఒంటబట్టించుకుందని కామెంట్లు

ధోనీ కాకుండా నలుగురైదుగురితో అఫైర్ నడిపానని అందాలతార రాయ్ లక్ష్మి తెలిపింది. హిందీలో నటించిన 'జూలీ-2' విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఆమె సినిమా ప్రమోషన్ లో బిజీబిజీగా గడుపుతోంది. బాలీవుడ్ లో ఎక్కడ ప్రమోషన్ కు వెళ్లినా మీడియా ధోనీతో అఫైర్ గురించి అడుగుతుండడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో తాను గతంలో మరో నలుగురైదుగురితో రిలేషన్ షిప్ లో ఉన్నానని, వారు కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నవారేనని తెలిపింది. వారందర్నీ వదిలేసి, కేవలం ధోనీ పేరే ఎందుకు ఇంకా ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించింది. దీంతో టాలీవుడ్, కోలీవుడ్ మీడియా షాక్ తింది. ఈ రెండు ఇండస్ట్రీల్లో ఇన్నేళ్లు ఉన్నప్పటికీ అఫైర్ ల గురించి మాట్లాడని లక్ష్మీ రాయ్, బాలీవుడ్ కి వెళ్లగానే అఫైర్ ల గురించి మాట్లాడేస్తోంది. మొత్తానికి బాలీవుడ్ ను బాగా ఆకళింపు చేసుకుందని ఫిల్మ్ నగర్ టాక్. 

More Telugu News