bellamkonda srinivas: ఫైట్స్ తో దుమ్మురేపేస్తున్న యంగ్ హీరో!

  •  శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ 
  •  కాశీలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ
  •  సినిమా షూటింగ్ 50 శాతం వరకూ పూర్తి
  •  కీలక పాత్రల్లో జగపతిబాబు, మీనా  

'జయ జానకి నాయక' సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ హిట్ కొట్టేశాడు. ఆ ఉత్సాహంతో ఆయన తన తదుపరి సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు. ఆయన తదుపరి సినిమాకి శ్రీవాస్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 'డిక్టేటర్' తరువాత ఆయన చేస్తోన్న సినిమా ఇది. ఇటీవలే పొల్లాచ్చిలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసిన ఈ సినిమా టీమ్, తదుపరి షెడ్యూల్ కోసం కాశీకి చేరుకుంది.

 హీరో కాంబినేషన్లోని భారీ యాక్షన్ సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగిన సెల్ఫీని బెల్లంకొండ శ్రీనివాస్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ 50 శాతం వరకూ పూర్తయింది. అభిషేక్ నామా నిర్మిస్తోన్న ఈ సినిమాకి టైటిల్ ను ఇంకా ఖరారు చేయలేదు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, జగపతిబాబు .. శరత్ కుమార్ .. మీనా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.       

More Telugu News