ఫోర్బ్స్‌ మేగజైన్: ఫోర్బ్స్‌ ‘వరల్డ్ 100 గ్రేటెస్ట్‌ లివింగ్‌ బిజినెస్‌ మైండ్స్’ జాబితాలో ముగ్గురు భారతీయులు

ఫోర్బ్స్‌ మేగజైన్ ప్ర‌క‌టించిన‌ ‘వరల్డ్ 100 గ్రేటెస్ట్‌ లివింగ్‌ బిజినెస్‌ మైండ్స్’ జాబితాలో ముగ్గురు భారతీయులు నిలిచారు. త‌మ‌ మేగజైన్‌ను ప్రారంభించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఫోర్బ్స్‌ ఒక ప్రత్యేక మేగ‌జైన్‌ను విడుదల చేసి, ప్ర‌త్యేక కథ‌నాన్ని ప్ర‌చురించింది. ప్రపంచవ్యాప్తంగా 100 వంది వ్యాపారస్తుల అభిప్రాయాల‌ను, వారి వ్యక్తిగత, వ్యాపార విశేషాలను తెలిపింది. పెట్టుబడులు రాబ‌ట్టం, వ్యాపారస్తుడి విజన్‌ ఎలా ఉండాలనే అంశాల‌ను కూడా ప్ర‌చురించింది.

వరల్డ్ 100 గ్రేటెస్ట్‌ లివింగ్‌ బిజినెస్‌ మైండ్స్ జాబితాలో భార‌త వ్యాపార‌వేత్త‌లు టాటా సన్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా, ఆర్సెలర్‌ మిట్టల్‌ అధినేత లక్ష్మీ మిట్టల్‌, సన్‌ మైక్రో సిస్టమ్స్‌ సహ వ్యవస్థాపకులు వినోద్‌ ఖోస్లా నిలిచారు.

More Telugu News