ntr: 'బాహుబలి 2' తరువాత స్థానంలో 'జై లవ కుశ'

  •  ప్రపంచవ్యాప్తంగా 2400 థియేటర్స్ లో 'జై లవ కుశ'
  •  భారీ ఓపెనింగ్స్ కోసమే ఈ స్థాయి రిలీజ్ 
  •  థియేటర్స్ కి రప్పించనున్న ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం
  •  దేవిశ్రీ సంగీతం ప్రత్యేక ఆకర్షణ  

ఎన్టీఆర్ కెరియర్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన 'జై లవ కుశ' చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున ఈ సినిమా 2400 థియేటర్స్ లో ప్రదర్శితం కానుంది. 'బాహుబలి 2' తరువాత అత్యధిక థియేటర్స్ లో విడుదలవుతోన్న సినిమా ఇదేనని అంటున్నారు.

బాబీ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకి, ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగింది. దాంతో తొలి రోజునే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టాలనే ఉద్దేశంతో అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి గల క్రేజ్ ను చూస్తుంటే తప్పకుండా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ .. విలక్షణమైన నటన .. దేవిశ్రీ సంగీతం .. రాశిఖన్నా - నివేదా థామస్ గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది.   

More Telugu News