sasikala: శశికళకు చెందిన నాలుగు డొల్ల కంపెనీలను స్తంభింపజేసిన కేంద్రం

  • శశికళకు కేంద్రం షాక్
  • బినామీ కంపెనీల జాబితాలో శశికళకు చెందిన నాలుగు కంపెనీలు
  • ఫ్యాన్సీ స్టీల్స్‌, రెయిన్‌ బో ఎయిర్‌, సుక్రా క్లబ్‌, ఇండో-దోహా కెమికల్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్స్‌ పేరుతో ఫేక్ కంపెనీలను నడుపుతున్న శశికళ
  • ఇండో-దోహా కెమికల్స్‌ అండ్ ఫార్మస్యూటికల్స్ కంపెనీలో శశికళ, ఇళవరసి డైరెక్టర్లు

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళకు మరో షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు కోటి డొల్ల కంపెనీలను కేంద్రం ఇటీవల రద్దు చేసింది. ఇందులో శశికళకు చెందిన నాలుగు కంపెనీలు కూడా స్థానం సంపాదించుకోవడం విశేషం. ఫ్యాన్సీ స్టీల్స్‌, రెయిన్‌ బో ఎయిర్‌, సుక్రా క్లబ్‌, ఇండో-దోహా కెమికల్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్స్‌ కంపెనీలు శశికళకు చెందినవి. ఇండో-దోహా కెమికల్స్‌ అండ్ ఫార్మస్యూటికల్స్ కంపెనీలో శశికళతోపాటు ఇళవరసి కూడా డైరెక్టర్ గా కొనసాగుతోంది. ఈ నాలుగు కంపెనీలను కేంద్రం స్తంభింపజేసింది. 

More Telugu News