ntr: బాబాయ్ ఇంకా మా సినిమా చూడలేదు : ఎన్టీఆర్

  •  రేపే ప్రేక్షకుల ముందుకు 'జైలవకుశ'
  •  బాలకృష్ణ చూసి ఎన్టీఆర్ ను అభినందించాడని ప్రచారం
  •  అందులో నిజం లేదన్న ఎన్టీఆర్
  •  అవుట్ పుట్ పట్ల ఎన్టీఆర్ సంతృప్తి

ఎన్టీఆర్ కథానాయకుడిగా కల్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కిన 'జై లవ కుశ' .. రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పెషల్ షో వేయించుకుని ఈ సినిమాను బాలకృష్ణ చూశారనీ .. ఎన్టీఆర్ నటనను అభినందించారంటూ ఒక వార్త షికారు చేస్తోంది. తాజాగా ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందించారు.

"బాబాయ్ మా సినిమా ఇంకా చూడలేదు .. బహుశా థియేటర్స్ కి వచ్చాక చూస్తారేమో" అని అన్నాడు. నిజానికి ఈ సినిమాను తాను బిట్స్ బిట్స్ గా చూశాను గానీ, పూర్తిగా ఇంకా చూడలేదని చెప్పాడు. అందుకు కారణం ఒక రకమైన టెన్షనేనని అన్నాడు. కల్యాణ్ రామ్ ఈ సినిమా చూశాడనీ, అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని అన్నాడని చెప్పాడు. ఇక తాను  హీరోననే విషయమే తన తనయుడు అభయ్ కి తెలియదు కనుక, ఐప్యాడ్ లో కార్టూన్స్ చూస్తున్నాడంటూ సరదాగా చెప్పుకొచ్చాడు.    

ntr

More Telugu News