spyder: ఒక్క సెన్సార్ కట్ కూడా పడని 'స్పైడర్'... ఆ రెండు సీన్లూ హైలైట్ అట!

  • యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు 
  • బండరాయి దొర్లే సీన్ అద్భుతమట
  • మరో యుద్ధ సన్నివేశం కూడా హైలైట్
  • 27న విడుదలకు సిద్ధం

మురుగదాస్ దర్శకత్వంలో, ప్రిన్స్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా, ఎస్జే సూర్య విలన్ గా నిర్మితమైన తాజా చిత్రం 'స్పైడర్' సెన్సార్ పూర్తయింది. వచ్చే వారంలో ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక 2.25 గంటల నిడివివున్న ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఒక్క కట్ కూడా చెప్పకుండా 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా అద్భుతంగా వచ్చిందని ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పినట్టు సమాచారం.

ఇక ఈ చిత్రంలో రెండు యుద్ధ సన్నివేశాలు సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తాయని వారు భావిస్తున్నారట. అందులో ఒకటి ట్రయిలర్ లో చూపించిన బండరాయి దొర్లుకుంటూ వచ్చే దృశ్యం కాగా, మరొకటి కూడా అటువంటిదే ఉందని సమాచారం. ఆ సీన్ ను వెండితెరపైనే చూపించాలన్న ఉద్దేశంతో దానికి సంబంధించిన ఏ విజువల్ నూ మురుగదాస్ బయటకు రానీయలేదని తెలుస్తోంది. ఈ చిత్రం 27వ తేదీ బుధవారం భారీ ఎత్తున విడుదల కానున్న సంగతి తెలిసిందే.

More Telugu News