balakrishna: బాలయ్యకు, మహేశ్ కు కథ వినిపించిన బోయపాటి?

  •   బాలకృష్ణకి బోయపాటి కథ వినిపించాడట
  •   మహేశ్ బాబును కూడా కలిశాడని టాక్
  •   మల్టీ స్టారర్ ఆలోచనలో బోయపాటి
  •  ఈ కాంబినేషన్ సెట్ చేయలేడంటూ ప్రచారం    

తాజాగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. దర్శకుడు బోయపాటి ఇటీవల బాలకృష్ణను కలిసి ఒక కథ చెప్పారట. త్వరలో బాలకృష్ణతో బోయపాటి ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ వార్త విషయంలో ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ ఆ తరువాత మహేశ్ బాబును కలిసి కూడా బోయపాటి ఒక కథ చెప్పారని అంటున్నారు.

మహేశ్ బాబుతో ఓ సినిమా చేసే ఛాన్స్ కోసం బోయపాటి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కనుక మహేశ్ ను కలిసి కథ చెప్పేసి ఉంటాడని అనుకోవచ్చు. కానీ ఆశ్చర్యపోవలసిన విషయం ఏమిటంటే, ఈ ఇద్దరు హీరోలకి బోయపాటి ఒకే కథను చెప్పాడనే టాక్ వినిపిస్తోంది. పైగా, ఒకరు కాదంటే మరొకరితో చేద్దామనే ఉద్దేశంతో కాదట .. అది మల్టీ స్టారర్ స్టోరీ అని వినికిడి. వేరు వేరు కథలతో ఈ ఇద్దరి హీరోలతో చేసే ఛాన్స్ బోయపాటికి వుండవచ్చునేమోగానీ, ఈ కాంబినేషన్లో సినిమా సెట్ కావడం ఎంతమాత్రం సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

More Telugu News