మోహన్ బాబు: మోదీ పిలుపు మేరకు పనిచేద్దాం: మోహన్ బాబు
- మోదీ తనకు లేఖ రాయడం పట్ల మోహన్ బాబు హర్షం
- స్వచ్ఛ భారత్ లో పాల్గొందామని పిలుపు
గాంధీ జయంతి రానున్న నేపథ్యంలో ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమంలో పాల్గొనాలని దేశంలోని వివిధ రంగాల ప్రముఖులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాసిన విషయం తెలిసిందే. తనకు మోదీ లేఖ రాయడం పట్ల సినీనటుడు మోహన్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ లక్ష్యమైన స్వచ్ఛ భారత్లో అందరం పాల్గొందామని మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన భారతావనిని తయారు చేస్తేనే మనం సంతోషంగా ఉండగలమని పేర్కొన్నారు. కాగా, నిన్న ప్రధాని మోదీ.. మోహన్బాబుతో పాటు దర్శకుడు రాజమౌళి, నటులు మహేశ్ బాబు, ప్రభాస్లకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.