vijay devarakonda: 'అర్జున్ రెడ్డి' పదో స్థానంతో సరిపెట్టుకోవాల్సిందే!

  • ఓవర్సీస్ లో ఓ రేంజ్ లో దూసుకుపోయిన 'అర్జున్ రెడ్డి' 
  •  టాప్ టెన్ చిత్రాల జాబితాలో పదో స్థానం
  •  అంతకన్నా ముందుకు వెళుతుందనే ఆశకి గండి

విజయ్ దేవరకొండ .. సందీప్ రెడ్డి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అర్జున్ రెడ్డి' .. ఒక రేంజ్ లో ప్రేక్షకుల్లోకి దూసుకుపోయింది. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించింది. యూఎస్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 10 సినిమాల జాబితాలో చివరి స్థానాన్ని సంపాదించుకుంది.

 1.75 మిలియన్ మార్క్ ను అందుకున్న ఈ సినిమా, 2 మిలియన్ మార్క్ ను చేరుకుంటుందనే అంతా అనుకున్నారు. అలా జరిగి వుంటే మరికొన్ని సినిమాలను వెనక్కి నెట్టేసి ఈ సినిమా ముందుకు వెళ్లేది. కానీ 'అర్జున్ రెడ్డి' ఆశ నెరవేరలేదు .. 1.75 మిలియన్ మార్క్ దగ్గరే ఆగిపోవలసి వచ్చింది. పదో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  ఈ సినిమా పెట్టుబడి పరంగా చూసుకుంటే .. ఓవర్సీస్ లో భారీ వసూళ్లు రాబట్టినట్టేనని చెప్పుకుంటున్నారు.  

More Telugu News