murder: ఆటోలో ప్రయాణిస్తూ భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త.. ఆపై తాను కూడా గొంతు కోసుకున్న వైనం

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని వేముల‌వాడ‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆటోలో పిల్ల‌ల‌తో పాటు ప్ర‌యాణిస్తూ ఓ వ్య‌క్తి త‌న‌ భార్య గొంతు కోశాడు. దీంతో ఆమె ఆటోలోనే ప్రాణాలు విడిచింది. భార్య‌ను హ‌త్య చేసిన తరువాత ఆ వ్య‌క్తి తాను కూడా గొంతు కోసుకుని ఆత్మ‌హ‌త్యాయత్నం చేశాడు. ఆయ‌న ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి పేరు వ‌సంత (32) అని చెప్పారు. కుటుంబ క‌ల‌హాల వ‌ల్లే వ‌సంత‌ను ఆమె భ‌ర్త హ‌త్య చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.

More Telugu News