ntr: 'జై లవ కుశ'లో మ్యారేజ్ బ్యూరో నడిపే పాత్రలో రాశి ఖన్నా!

  •  'జై లవ కుశ'లో 'లవ' జోడీగా రాశి ఖన్నా
  •  మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలి పాత్ర
  •  ఈ రెండు పాత్రల మధ్య కామెడీ .. రొమాన్స్
  •  హిట్ ఖాయమంటోన్న రాశి   

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన 'జై లవ కుశ' సినిమాలో రాశిఖన్నా .. నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో 'జై' పాత్ర సరసన నివేదా థామస్ కనిపించనుంది. ఇక లవ కుమార్ పాత్ర జోడీగా రాశిఖన్నా అలరించనుందని సమాచారం. ఈ సినిమాలో తన పాత్ర పేరు 'ప్రియ' అని తెలుస్తోంది. మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలిగా ఆమె ఈ సినిమాలో కనిపిస్తుందని అంటున్నారు.

లవ కుమార్ కి  రాశిఖన్నా తారసపడటం దగ్గర నుంచి వాళ్ల ట్రాక్ రసవత్తరంగా కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే కామెడీ .. రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకునేలా వుంటాయని అంటున్నారు. 'సుప్రీమ్' సినిమాలో 'బెల్లం శ్రీదేవి' పాత్ర ఆమెకి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో, ఈ సినిమాలోని 'ప్రియ' పాత్ర కూడా అంతకుమించి పేరు తెస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో ఈ ఏడాది రాశి ఖన్నా ఖాతాలోకి బ్లాక్ బస్టర్ వెళ్లడం ఖాయమని చెబుతున్నారు.     

More Telugu News