ntr: రాశి ఖన్నా డబ్బింగ్ చెప్పుకుంటానంటే నో చెప్పిన ఎన్టీఆర్!

  •  మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు 'జై లవ కుశ' 
  •  తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవాలనుకున్న రాశి ఖన్నా
  •  ప్రయోగాలు వద్దని చెప్పిన ఎన్టీఆర్
  •  నెక్స్ట్ మూవీకి చెప్పుకోవాలనే ఆలోచనలో రాశి ఖన్నా

'జై లవ కుశ' సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా రాశి ఖన్నా నటించింది. డాన్స్ విషయంలో ఎన్టీఆర్ సరసన మెప్పించడానికి ఆమె ఎంతగానో కష్టపడిందట. డాన్స్ విషయంలో ఆమెను ఎన్టీఆర్ ఎంతగానో మెచ్చుకున్నాడు. అయితే రాశి ఖన్నా డబ్బింగ్ చెబుతానంటే మాత్రం నో అనేశాడట.

రాశిఖన్నా తెలుగు బాగానే మాట్లాడుతుంది. అందువలన ఆమె ఈ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంది. దర్శకుడు బాబీ దగ్గర ఈ విషయాన్ని కదిలిస్తే, ఆయన ఎన్టీఆర్ దృష్టికి తీసుకువెళ్లాడట. అనవసరమైన రిస్క్ తీసుకోవద్దనీ .. రాశి ఖన్నాకు రెగ్యులర్ గా డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ తోనే చెప్పించమని ఎన్టీఆర్ అనడంతో అలాగే చేశారు. దాంతో తన నెక్స్ట్ మూవీకి డబ్బింగ్ చెప్పుకోవాలనే ఆలోచనలో రాశి ఖన్నా ఉందని అంటున్నారు.     

More Telugu News