pv sindhu: అంద‌రి దృష్టి సింధు పైనే... రేపు ప్రారంభం కానున్న జ‌పాన్ ఓపెన్ సూప‌ర్ సిరీస్‌

  • మూడోసారి నోజోమీతో త‌ల‌ప‌డే అవ‌కాశం
  • మినాట్సు మిటానితో కూడా త‌ల‌ప‌డ‌నున్న తెలుగు తేజం
  • బ‌రిలో దిగ్గ‌జ ప్లేయ‌ర్లు - సైనా, శ్రీకాంత్‌, క‌శ్య‌ప్‌, ప్ర‌ణయ్‌


కొరియా ఓపెన్ సూప‌ర్ సిరీస్ విజయం త‌ర్వాత సోమ‌వారం ప్రారంభం కానున్న జ‌పాన్ ఓపెన్ సూప‌ర్ సిరీస్ మీద పీవీ సింధు దృష్టి సారించింది. అదేవిధంగా సింధు ఈ టైటిల్ కూడా సాధించాలని కోరుకుంటూ క్రీడాలోకం ఆమె మీద దృష్టి సారించింది. కొరియా ఓపెన్‌లో త‌ల‌ప‌డిన మినాట్సు మిటానితో సింధు ఓపెనింగ్ రౌండ్ త‌ల‌ప‌డ‌నుంది. అలాగే కొరియా ఓపెన్ ఫైన‌ల్లో సింధు ఓడించిన జ‌ప‌నీస్ క్రీడాకారిణి నోజోమీ ఒకుహ‌రా ఓపెనింగ్ రౌండ్‌లో హాంగ్‌కాంగ్‌కు చెందిన చుయెంగ్ గాన్ యీతో త‌ల‌ప‌డుతుంది.

ఓపెనింగ్ రౌండ్లో సింధు, నోజోమీలు చ‌క్క‌ని ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిస్తే జ‌పాన్ ఓపెన్ సూప‌ర్ సిరీస్ ఫైన‌ల్లో కూడా వారిద్ద‌రూ త‌ల‌ప‌డే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. మ‌రోవైపు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు కూడా ఈ సూప‌ర్ సిరీస్‌లో పాల్గొననున్నారు. ఓపెనింగ్ రౌండ్‌లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి పార్న్‌పావీ చొచువాంగ్‌తో సైనా, చైనాకు చెందిన తియాన్ హువేతో శ్రీకాంత్ త‌ల‌ప‌డ‌నున్నారు.

More Telugu News