accident: క‌ర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు ద‌గ్ధం, ముగ్గురు సజీవదహనం

క‌ర్నూలు జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. వేగంగా ప్ర‌యాణిస్తున్న కారు అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌న ఉన్న మ‌ట్టి దిబ్బ‌ల‌ను ఢీకొట్ట‌డంతో మంట‌లు చెల‌రేగాయి. దీంతో కారులో ఉన్న న‌లుగురిలో ముగ్గురు సజీవ ద‌హ‌న‌మ‌య్యారు. ఆళ్ల‌గ‌డ్డ స‌మీపంలోని బ‌త్త‌లూరు స‌మీపంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వైపు వెళ్తున్న కారు అదుపు త‌ప్ప‌డంతో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మ‌ట్టి దిబ్బ‌ల‌ను కారు ఢీకొట్టిన వెంట‌నే కారులో మంట‌లు వ్యాపించాయి. కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు మంట‌ల‌కు ఆహుత‌య్యారు. తీవ్రంగా గాయ‌ప‌డిన రాజాప్ర‌సాద్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో ఇద్ద‌రు చిన్నారులు కూడా ఉన్నారు. వీరిని ప్రొద్దుటూరుకు చెందిన వ‌నితాబాయి, పిల్ల‌లు ప్రేమ్‌కుమార్ (5), ఉమేష్ (2)గా గుర్తించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News