టీమిండియా: బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. టార్గెట్: 21 ఓవర్లలో 164 పరుగులు!

చెన్నైలో జ‌రుగుతోన్న టీమిండియా, ఆస్ట్రేలియా మొద‌టి వ‌న్డే మ్యాచులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 281 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ వెంటనే వర్షం పడడంతో మొదట మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించారు. విజయ లక్ష్యాన్ని 238 పరుగులుగా నిర్దేశించారు. అయితే, వర్షం ఆగకుండా పడుతూనే ఉండడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల‌స్యంగా ప్రారంభించింది. దీంతో ఈ వ‌న్డేలో ఓవ‌ర్ల‌ను మ‌రోసారి కుదించారు. 21 ఓవ‌ర్ల‌లో 164 ప‌రుగుల లక్ష్యాన్ని ఇచ్చారు. క్రీజులో ఆస్ట్రేలియా ఓపె‌న‌ర్లు డేవిడ్ వార్న‌ర్ 6, హిల్ట‌న్ కార్ట్‌రైట్ 0 ప‌రుగుల‌తో ఉన్నారు.   

More Telugu News