ilaiah: దేశంలో 46 శాతం ఆస్తులు కోమట్ల చేతుల్లోనే ఉన్నాయి!: కంచ ఐలయ్య

‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అంటూ పుస్తకాన్ని రాసిన ప్రొ. కంచ ఐల‌య్య ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఆర్యవైశ్యులపై మ‌ళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హన్మకొండలోని టీమాస్‌ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... దేశంలో పెద్ద పారిశ్రామిక వేత్తలంతా ఆర్యవైశ్యులేన‌ని చెప్పారు. ఇక తాను ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సమస్యలపై పోరాడతానని తేల్చి చెప్పారు. బెదిరింపులకు భయపడబోన‌ని తెలిపారు. దేశంలో 46 శాతం ఆస్తులు కోమట్ల చేతుల్లోనే ఉన్నాయని అన్నారు. ఇక‌ టీమాస్‌ ఫోరానికి పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేస్తాన‌ని చెప్పారు. తెలంగాణ‌లోనే కాక ఆంధ్రప్రదేశ్‌లో కూడా తిరుగుతానని వెల్ల‌డించారు.

More Telugu News