rajmouli: మరింత కష్టపడతా.. అక్కినేని జాతీయ పుర‌స్కారం నాపై బాధ్య‌త‌ను పెంచింది: రాజ‌మౌళి

హైద‌రాబాద్ శిల్ప క‌ళా వేదిక‌లో ఈ రోజు అక్కినేని నాగేశ్వ‌ర రావు జాతీయ పుర‌స్కార వేడుక జ‌రిగింది. ఈ వేడుక‌కి ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి వెంక‌య్య నాయుడు.. అక్కినేని జాతీయ పురస్కారం-2017ను అందించారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ... అక్కినేని జాతీయ పుర‌స్కారం స్వీక‌రించ‌డం త‌న‌పై బాధ్య‌త‌ను పెంచిందని అన్నారు. ఈ అవార్డును అందుకోవ‌డం గ‌ర్వంగా ఉందని చెప్పారు. ఈ పుర‌స్కారానికి గౌర‌వం తెచ్చేలా మ‌రింత క‌ష్ట‌ప‌డ‌తాన‌ని అన్నారు. 

More Telugu News