ntr: 'జై లవకుశ' పైనే ఆ ముగ్గురి ఆశలు!

  •  భారీ నష్టాల తరువాత కల్యాణ్ రామ్ చేసిన మూవీ
  •   బాబీకి తానేంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి
  •  ఈ సినిమా హిట్ రాశి ఖన్నాకు చాలా అవసరం
  •  విడుదలకి ముందే వినిపిస్తోన్న పాజిటివ్ టాక్


'జై లవ కుశ' సినిమా ఈ నెల 21వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. రిలీజ్ రోజునే ఈ సినిమాను చూసేయాలనే ఆత్రుతతో ఎన్టీఆర్ అభిమానులు వున్నారు. ఈ సినిమాకి ముందు కల్యాణ్ రామ్ నిర్మించిన కొన్ని సినిమాలు ఆయనకి భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. ఆయన ఆర్థికంగా మళ్లీ పుంజుకోవాలంటే ఈ సినిమా ఘన విజయాన్ని సాధించవలసి వుంది.

 ఇక దర్శకుడు బాబీ విషయానికి వస్తే 'సర్దార్ గబ్బర్ సింగ్' భారీ పరాజయం తరువాత ఆయన చేసిన మూవీ ఇది. ఈ సినిమాతో తానేంటన్నది ఆయన నిరూపించుకోవాల్సి వుంది. ఇక నివేదా థామస్ కన్నా రాశి ఖన్నాకు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. తెలుగు తెరకి పరిచయమైన చాలా కాలం తరువాత ఆమెకు దక్కిన గొప్ప ఛాన్స్ ఇది. ఇది బ్లాక్ బస్టర్ అయితే ఆమెకి మరికొంతమంది స్టార్ హీరోల పక్కన జోడీకట్టే అవకాశాలు వస్తాయి. ఈ ముగ్గురి దశను మార్చేసే లక్షణాలు ఈ సినిమాకి వున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం, వాళ్లకి ఉత్సాహాన్ని కలిగించే విషయం.  

More Telugu News