cartoon: ఈ కార్టూన్ నన్ను బాగా టచ్ చేసింది: ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేంద్ర ప్ర‌భుత్వం 'స్వచ్ఛత హై సేవ' పేరుతో దేశంలోని అన్ని న‌గ‌రాల్లో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ప్ర‌తిజ్ఞ చేయిస్తోన్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే నెల 2న గాంధీ జ‌యంతి నేప‌థ్యంలో మోదీ 'స్వచ్ఛత హై సేవ' పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా దీనిపై విశేష స్పంద‌న వ‌స్తోంది. ప‌లు న‌గ‌రాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నారు.

కాగా, ‘గ్రీన్ సిటీ, క్లీన్ సిటీ మై డ్రీమ్ సిటీ’ అంటూ రోహిణి గుప్త అనే వ్య‌క్తి వేసిన ఓ కార్టూన్ ప్ర‌ధాని మోదీకి బాగా న‌చ్చేసింది. ఆ కార్టూన్‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన మోదీ ఈ కార్టూన్ త‌న‌ను బాగా ట‌చ్ చేసింద‌ని పేర్కొన్నారు. స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వేసిన‌ ఈ కార్టూన్‌లో మ‌హాత్మా గాంధీ, మోదీ, ఓ చిన్నారి ఉన్నారు. మోదీ, ఓ చిన్నారి ప‌రిస‌రాల‌ను శుభ్రం చేస్తున్న‌ట్లు ఈ కార్టూన్ ఉంది. 

More Telugu News