road accident: త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డ 80 మంది బస్సు ప్రయాణికులు

కర్నూలు జిల్లా సంజమాల-అవుకు రహదారిలో త్రుటిలో 80 మంది బ‌స్సు ప్ర‌యాణికులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ రహదారిలో వెళుతోన్న‌ ఆర్టీసీ బ‌స్సు పాలేరు వాగు ఉద్ధృతికి ప‌క్క‌కు ఒరిగింది. దీంతో ప్ర‌యాణికులు తీవ్ర ఆందోళ‌న చెందారు. వెంట‌నే ఆ బ‌స్సులోంచి  అంద‌రూ దిగిపోయారు. వారు దిగిన కొన్ని క్ష‌ణాల‌కే ఆ బ‌స్సు వాగులో ప‌డిపోయింది. దీనిపై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని ప‌రిస్థితిని స‌మ‌క్షించారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవరికీ ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు. ఆ బ‌స్సు కోవెల‌కుంట్ల డిపోకి చెందిన‌ద‌ని తెలిపారు.        

More Telugu News