mahesh babu: రకుల్ ను మరిచిపోయి మళ్లీ వెనక్కి వచ్చిన మహేశ్ బాబు!

  •  ఘనంగా జరిగిన 'స్పైడర్' ప్రీ రిలీజ్ వేడుక
  •  అభిమానులను ఉత్సాహపరుస్తూ మాట్లాడిన మహేశ్
  •  రకుల్ గురించి మాట్లాడటం మరిచిపోయిన మురుగదాస్ .. మహేష్
  •  ఆ తరువాత గుర్తుచేసుకుని థ్యాంక్స్ చెప్పిన తీరు  

మురుగదాస్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందిన 'స్పైడర్' మూవీ, ఈ నెల 27వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

 ఈ వేదికపై మహేశ్ బాబును ఆకాశానికి ఎత్తేసిన మురుగదాస్ .. రకుల్ గురించి మాట్లాడటం మరిచిపోయారు. ఆ తరువాత ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఆమెకి థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా తప్పకుండా రకుల్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందని అన్నారు. ఇక ఆ తరువాత మహేశ్ బాబు కూడా, ఈ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. స్టేజ్ దిగబోతూ రకుల్ ను గుర్తుకు తెచ్చుకుని వెనక్కి వచ్చారు. రకుల్ అంకితభావాన్ని అభినందిస్తూ మాట్లాడారు. దర్శకుడు అడిగినప్పుడల్లా డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తూ వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు.   

More Telugu News