cricket: ఆటో తోసిన ఆట‌గాళ్లు... న‌వ్వు తెప్పిస్తున్న వీడియో ఇదే!

అనుకోకుండా జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు బాగా న‌వ్వుతెప్పిస్తాయి. లాహోర్ స్టేడియంలో పాకిస్థాన్ - ప్ర‌పంచ ఎలెవ‌న్ జ‌ట్ల మ‌ధ్య తొలి టీ20 జర‌గ‌డానికి ముందు కూడా న‌వ్వు తెప్పించే సంఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది. మైదానంలోకి విదేశీ ఆట‌గాళ్లను ప్ర‌త్యేకంగా తీసుకురావాల‌ని ఆతిథ్య జ‌ట్టు వినూత్నంగా ఆలోచించింది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఆటో రిక్షాల‌ను సిద్ధం చేశారు. అయితే మైదానంలో రౌండ్లు కొడుతుండ‌గా ఒక ఆటో రిక్షా మ‌ధ్య‌లో ఆగిపోయింది. దీంతో అందులో కూర్చున్న విదేశీ క్రికెట‌ర్లు తామే స్వ‌యంగా ఆటో దిగి తోసి, స్టార్ట‌వ‌డంతో మ‌ళ్లీ అందులో ఎక్క‌డం వీడియోలో చూడొచ్చు. ఎన్నో ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా తొలి టీ20కి ముందు ఆటగాళ్లకు ఘనస్వాగతం ఏర్పాటు చేశారు. ఆటోను తోస్తున్న వారిలో వెస్టిండీస్‌ ఆటగాడు డారెన్‌ సామి కూడా ఉన్నాడు.

More Telugu News