mahesh: డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను స్టన్ అయిపోయా!: మహేష్ బాబు

  • పదేళ్ల క్రితమే మురుగదాస్ కలిశాడు
  • స్పైడర్ చిత్ర కథను గంటన్నరపాటు చెప్పాడు
  • అద్భుతమైన థ్రిల్లర్ చేద్దామని అన్నాడు
  • అనుకున్నట్టే థ్రిల్ ను కలిగించేలా స్పైడర్: మహేష్

'స్పైడర్' చిత్రానికి డబ్బింగ్ చెబుతూ, సినిమా చూసిన తాను స్టన్ అయిపోయానని ప్రిన్స్ మహేష్ బాబు వ్యాఖ్యానించారు. పదేళ్ల క్రితం 'పోకిరి' చిత్రం చేస్తున్న సమయంలో మురుగదాస్ కలిశాడని, అప్పట్లోనే ఓ సినిమా చేయాలని ఇద్దరమూ అనుకున్నామని, ఆ సమయం ఇప్పటికి కుదిరిందని చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మహేష్ బాబు పేర్కొన్నాడు.

'మురుగదాస్ నన్ను కలిసి స్పైడర్ కథను గంటన్నర పాటు చెప్పాడు. ఒక అద్భుతమైన ధ్రిల్లర్ చేద్దామన్నాడు. ఎక్స్ ట్రార్డినరీ ఫోటోగ్రఫీ, బ్రహ్మాండమైన సెట్ డిజైన్స్ ఉంటాయని చెప్పాడు. మొత్తం 2.25 గంటల నిడివి వుంటుందని ముందే చెప్పాడు. చూసే ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతూ స్టన్ అవుతారని చెప్పాడు. ఆడియన్స్ ఏమిటీ, డబ్బింగ్ చెప్పేటప్పుడు నేనే స్టన్ అయిపోయాను సినిమా చూస్తూ' అని అన్నాడు. ఇక ఇదే కార్యక్రమంలో మాట్లాడిన డైరెక్టర్ మురుగదాస్ మాట్లాడుతూ, పోకిరి చిత్రం షూటింగ్ సమయంలో మహేష్ ఎలాగున్నాడో, ఇప్పుడూ అలాగే ఉన్నాడని కితాబిచ్చాడు. ఈ ఏడాదిన్నర సమయం మహేష్ తో జర్నీని తానెన్నడూ మరచిపోలేనని అన్నాడు.

More Telugu News