shankar: 'భారతీయుడు' సీక్వెల్ ఆలోచనలో శంకర్!

శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రాలలో 'భారతీయుడు' సినిమాది ప్రత్యేకమైన స్థానం అనే చెప్పాలి. కమల్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ విజయవిహారం చేసింది. అప్పటి నుంచి కూడా ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన దర్శకుడు శంకర్ కి వుంది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఎ.ఎమ్.రత్నం కూడా అందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. కానీ ఎందుకనో ఈ సీక్వెల్ ఆలోచన ఆచరణలోకి రాలేదు.

ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ పై శంకర్ దృష్టి పెట్టాడని అంటున్నారు. కమల్ తో చర్చలు కూడా జరుపుతున్నాడని చెబుతున్నారు. ఈ ఇద్దరూ ఓకే అంటే నిర్మాతగా తాను సిద్ధంగా ఉన్నానని ఎ.ఎమ్.రత్నం కూడా చెప్పేశాడట. 'రోబో' సీక్వెల్ గా తెరకెక్కిన '2.0' రిలీజైన తరువాత, 'భారతీయుడు' సీక్వెల్ పై శంకర్ పూర్తి దృష్టి పెట్టొచ్చునని చెప్పుకుంటున్నారు.

More Telugu News