: మందుబాబులకు వడ్డింపు... ఏపీలో మద్యం ధరలను భారీగా పెంచిన ప్రభుత్వం!

* రూ. 450 లోపు ఫుల్ బాటిల్ పై 3 శాతం

* అంతకుమించిన ధరైతే 9 శాతం

* తక్షణం అమలులోకి పెంచిన ధరలు

* ఉత్తర్వులు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలను పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 400 నుంచి రూ. 450 ధర మధ్య ఉండే బ్రాండ్లపై 3 శాతం అదనపు ధర వసూలుకు ఆదేశాలు ఇస్తూ, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ జీవో విడుదల చేసింది. ఇక రూ. 450కి పైగా ధర కలిగిన బ్రాండ్లపై 9 శాతం ధరను పెంచాలని పేర్కొంది. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని వెల్లడించింది. కాగా, అత్యధిక మద్యం బ్రాండ్ల ఫుల్ బాటిల్ ధరలు రూ. 400 నుంచి రూ. 450 మధ్యలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని కంపెనీల మద్యం బ్రాండ్ల ధరలూ పెరిగిపోనున్నాయి. రూ. 450 ధర ఉన్న ఫుల్ బాటిల్ కు ఇకపై రూ. 463.50 అవనుంది. ఇక అంతకుమించిన ధరలో ఉండే మద్యం కావాలంటే మాత్రం జేబుకు చిల్లే!

More Telugu News