: మరోమారు తడిసి ముద్దవుతున్న భాగ్యనగరం.. హైదరాబాద్‌లో కుండపోత

హైదరాబాద్ మరోమారు తడిసి ముద్దవుతోంది. రాత్రి నుంచి పడుతున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు వాగులను తలపిస్తున్నాయి.  చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుకుంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి మోకాలి లోతులో నీళ్లు రావడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ‌మణికొండ, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట సహా అన్ని ప్రాంతాల్లోనూ వర్షం కుమ్మేసింది. రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌లో భారీ వర్షం పడగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆ దెబ్బ నుంచి ఇప్పటివరకు తేరుకోనేలేదు. అంతలోనే మళ్లీ పగబట్టినట్టు వరుణుడు రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురిపిస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

More Telugu News