: మిషన్‌ భగీరథ, స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలు స‌మ‌ర్థ‌వంతంగా చేప‌డుతున్నారు!: కేటీఆర్‌కు మోదీ అభినందన లేఖ

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. రాష్ట్రంలో మిషన్‌ భగీరథ, స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలు స‌మ‌ర్థ‌వంతంగా చేప‌డుతున్నార‌ని పేర్కొంటూ ఈ మేర‌కు కేటీఆర్‌కి మోదీ ఓ లేఖ రాశారు. మ‌రికొన్ని రోజుల్లో మ‌హాత్మా గాంధీ జ‌యంతి రానున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం చేప‌డుతోన్న  ‘స్వచ్ఛత హి సేవా’ ఉద్యమంలో పాల్గొనాలని కేటీఆర్‌ను ఆహ్వానించారు. తెలంగాణ‌లో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం పట్ల స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు. మ‌న ప‌రిస‌రాలు ప‌రిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి సాధ్య‌ప‌డుతుంద‌ని వివ‌రించారు. కేటీఆర్‌ తన అనుభవాలను నరేంద్ర మోదీ యాప్‌లో పంచుకోవాలని ఆయ‌న చెప్పారు. దేశ వ్యాప్తంగా స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మాన్ని మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు.  

More Telugu News