chiranjeevi: 'సైరా నరసింహా రెడ్డి' ప్రాజెక్టు నుంచి ఏఆర్ రెహ్మాన్ తప్పుకున్నాడా?

'సైరా నరసింహా రెడ్డి' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటించనుండగా, అమితాబ్ .. జగపతిబాబు .. సుదీప్ .. విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎ.ఆర్. రెహ్మాన్ పేరును ప్రకటించారు.

 అయితే ప్రస్తుతం తాను బిజీగా ఉన్నాననీ, అందువలన ఈ ప్రాజెక్టు చేయలేనని రెహ్మాన్ చెప్పినట్టు సమాచారం. తనకి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయనీ .. అవి పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి వస్తుందని, అందుకని తనకి కుదరదని రెహ్మాన్ అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా ప్రస్తుతం జరుగుతోన్న ప్రచారం మాత్రమే. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి వుంది.   

More Telugu News