ntr: 'జై లవ కుశ' రిలీజ్ కాగానే విదేశాలకి ఎన్టీఆర్ ప్రయాణం!

ఎన్టీఆర్ తన కెరియర్లో తొలిసారిగా మూడు పాత్రలను పోషించిన 'జై లవ కుశ' సినిమా, ఈ నెల 21వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఎన్టీఆర్ వున్నాడు. ఈ సినిమా రిజల్ట్ చూసుకుని ఆయన విదేశాలకి వెళ్లనున్నట్టు సమాచారం.

ముందుగా ఆయన యూరప్ వెళ్లి అక్కడ ఓ నెల రోజుల పాటు 'డీ టాక్సినేషన్ థెరపీ' చేయించుకుంటాడట. శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించే థెరపీ ఇది. ఆ తరువాత అక్కడి నుంచి మలేసియా వెళ్లి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటాడని అంటున్నారు. ఎన్టీఆర్ తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండనుంది .. ఆ సినిమా కోసమే ఈ శిక్షణ. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని అంటున్నారు. జనవరి 23 .. 24వ తేదీల్లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

ntr

More Telugu News