: 'జై లవ కుశ' సినిమాపై సెన్సార్ బోర్డు సభ్యుడి అభిప్రాయం!

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై లవ కుశ'... అదే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజెనెస్ చేసింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'యూ/ఏ' సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు... ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ టాక్ ఎలా ఉందో వెల్లడించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందని... మూడు పాత్రల్లోనూ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని కితాబిచ్చారు. సినిమా చాలా బాగా వచ్చిందని... ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్పారు. 

More Telugu News