: ఎమ్మెల్యేకు క‌ల్తీనెయ్యి వ‌డ్డించిన హోట‌ల్ సిబ్బంది.. జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోని వైనం!

భారతీయ జనతా పార్టీ నేత, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. హైద‌రాబాద్‌ కుషాయిగూడ‌లోని ఓ హోట‌ల్ కు భోజనానికి వెళ్లిన ఆయ‌న‌కు హోట‌ల్ సిబ్బంది క‌ల్తీ నెయ్యి వ‌డ్డించారు. ఈ విష‌యాన్ని గుర్తించిన ప్ర‌భాక‌ర్ వెంట‌నే జీహెచ్ఎంసీ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే, తాను ఫిర్యాదు చేసినప్ప‌టికీ జీహెచ్ఎంసీ అధికారులు ప‌ట్టించుకోలేద‌ని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనంత‌రం హోట‌ల్‌లో క‌ల్తీ నెయ్యి పై ఫుడ్ ఇన్‌స్పెక్ట‌ర్ల‌కు స‌ద‌రు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.        

More Telugu News