: అతిశ‌క్తిమంత‌మైన పాస్‌పోర్ట్‌... కేవ‌లం 500 మందికే!

సావ‌రిన్ మిల‌ట‌రీ ఆర్డ‌ర్ ఆఫ్ మాల్టా ఆమోద‌ముద్ర ఉన్న పాస్‌పోర్టును అతిశ‌క్తిమంత‌మైన పాస్‌పోర్టు అన‌డంలో అతిశ‌యోక్తి లేదేమో... ఎందుకంటే దీన్ని చూడ‌గానే 177 దేశాలు మారుమాట్లాడకుండా త‌మ దేశంలో తిర‌గ‌డానికి వీసా జారీ చేస్తాయి. అందుకే ఈ పాస్‌పోర్టును కేవ‌లం 500 మందికే జారీ చేస్తారు. సావ‌రిన్ మిల‌ట‌రీ అనేది ఓ రోమ‌న్ క్యాథ‌లిక్ సంస్థ‌. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 120 దేశాల్లో సేవలు అందిస్తోంది.

 వైద్య, సామాజిక, మానవతా కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు ఈ సంస్థ అండ‌గా ఉంటుంది. వారి కౌన్సిల్‌లో ప‌నిచేసే అతికొద్దిమంది సభ్యులకు, దౌత్య కార్యకలాపాలు సాగించేవారికి (కొన్ని సార్లు అత్యవసర పరిస్థితుల్లో వారి పిల్లలకు) మాత్రమే ఈ పాస్‌పోర్టులు మంజూరు చేస్తారు. అయితే ఈ పాస్‌పోర్టు కాల‌ప‌రిమితి నాలుగు సంవ‌త్స‌రాలు మాత్ర‌మే. సావ‌రిన్ మిల‌ట‌రీ సంస్థ 106 దేశాల‌తో అధికారికంగా దౌత్య సంబంధాలు క‌లిగి ఉంది. ప్రస్తుతం దీని పరిధిలో 13,500 మంది సిబ్బంది, 80,000 మంది శాశ్వత వాలంటీర్లు, 25,000మంది ఉద్యోగులు పని చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News