: భార‌త ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ఫాద‌ర్ టామ్‌... ట్వీట్‌లో వెల్ల‌డించిన సుష్మాస్వ‌రాజ్‌

ఇస్లామిక్ స్టేట్ తీవ్ర‌వాదుల చెర నుంచి త‌న‌ను ర‌క్షించినందుకు గాను కేర‌ళ‌కు చెందిన ఫాద‌ర్ టామ్ భార‌త ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసిన‌ట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్ తెలిపారు. ప్ర‌స్తుతం వాటిక‌న్ సిటీలో ఉన్న టామ్ త‌న‌తో ఫొన్లో మాట్లాడార‌ని ఆమె పేర్కొన్నారు. వ‌రుస ట్వీట్ల‌తో ఫాద‌ర్ టామ్ మాట్లాడిన విష‌యాల‌ను ఆమె పంచుకున్నారు.

త‌న‌ను కాపాడ‌టానికి కృషి చేసినందుకు ప్ర‌భుత్వానికి, ప్ర‌ధానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశార‌ని, అలాగే త‌న‌ను ర‌క్షించ‌డంలో పాటుప‌డిన ప్ర‌తిఒక్క‌రికి, ఒమ‌న్‌, యెమెన్ ప్ర‌భుత్వాల‌కు కూడా ఫాద‌ర్ టామ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపార‌ని సుష్మా పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా టామ్‌ను ర‌క్షించ‌డంలో ఎలాంటి డ‌బ్బు చెల్లించ‌లేద‌ని విదేశాంగ స‌హాయ మంత్రి వీకే సింగ్ ప్ర‌క‌టించారు.

More Telugu News